నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 11:08

హైదరాబాద్,బేగంపేట్‌లో కాల్పుల కలకలం..

ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడు.. ఆగంతకుడితో తిరగబడ్డ తల్లీ కూతుళ్లు.

ఇద్దరు అగంతకులను అదుపులో తీసుకున్న పోలీసులు.

తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చేరుబడ్డట్టు గుర్తించిన పోలీసులు.

రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న నార్త్ జోన్ డిసిపి రోహిణి ప్రియదర్శిని.

చడీచప్పుడు లేకుండా ఇంట్లోకి దూరిన అజ్ఞాత వ్యక్తి.. ఎవరు నువ్వు అని తల్లికూతుళ్లు అడగ్గా..

హైదరాబాద్‌ బేగంపేటలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. గన్‌తో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో తల్లీకూతురు విరోచితంగా పోరాడారు. దొంగల్ని తరిమితరిమికొట్టారు.

తుపాకీతో ఇంట్లోకి చొరబడిన అగంతకులతో విరోచితంగా పోరాడి బడిత పూజ చేశారు తల్లీకూతుర్లు. తుపాకీ, కత్తులతో ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరించినా బెదరకుండా దొంగల భరతం పట్టారు.

ఈ ఘటన హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. మాస్క్‌, హెలిమెంట్, చేతితో కత్తి, తుపాకీతో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు దొంగలు తల్లీకూతుర్ని బెదిరించి.. బంగారం, నగదు కొట్టేయ్యాలని ప్లాన్ చేశారు.

గన్‌తో బెదిరింపులకు పాల్పడినా ఏమాత్రం బెదరకుండా దుండగుడితో విరోచితంగా పోరాటం చేసి.. జుట్టుపట్టుకొని ఒక దొంగను ఇంటిబయట ఈడ్చిపడేసింది.

అతని దగ్గర తుపాకీ లాక్కోని చితకొట్టింది. తల్లికితోడుగా కూతురు కూడా దొంగపై దాడి చేయడంతో పరుగు తీశారు. తర్వాత ఇంట్లో ఉన్న మరో దొంగను కూడా పరిగెత్తించి కొట్టారు తల్లికూతుళ్లు.

ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించారు. గతంలో దీపావళి టైంలో జైన్ ఇంట్లో క్లీనింగ్ కోసం వచ్చారని చెబుతున్నారు ఆర్‌కే జైన్ భార్య. ఇంటి గుట్టు తెలుసుకొని సంవత్సరం తర్వాత దొంగతనానికి ప్లాన్ వేశారని పోలీసులు చెప్పారు. నిందితులనుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

ఆర్ కే జైన్ మేడ్చల్ లో ఓ పరిశ్రమ నడుపుతున్నారు. మరోవైపు తల్లీకూతురు దుండగుడితో పోరాడిన వీడియో సోషల్ మీడియాలోను వైరల్‌గా మారింది.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 10:08

నేటి నుంచి ఐపీఎల్‌ టోర్నీ.. మొదటి పోరులో చెన్నైతో బెంగళూరు ‘ఢీ’

చెన్నై వేదికగా నేడు ఐపీఎల్‌ 17వ సీజన్‌ మొదలు కానుంది.

గత ఏడాదిలాగే 10 జట్లు 74 మ్యాచ్‌లతో టోర్నీ సిద్ధం కాగా.... ఎన్నికల కారణంగా తొలి దశలో 21 మ్యాచ్‌లకే బీసీసీఐ షెడ్యూల్‌ ప్రకటిం చింది.

గత కొద్ది రోజులుగా భారత టెస్టు క్రికెట్‌ను ఆస్వాదించిన ఫ్యాన్స్‌ రాబోయే దాదాపు ఎనిమిది వారాల పాటు బౌండరీల గురించే చర్చిం చడం ఖాయం.

చెన్నై కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న ధోని

ఐపీఎల్‌–2024కు రంగం సిద్ధమైంది. ఎంఎ చిదంబరం స్టేడియంలో నేడు జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ తో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతుంది.

గత రెండు సీజన్ల తరహా లోనే ప్రతీ జట్టు 14 మ్యాచ్‌ ల చొప్పున ఆడుతుంది. ఐపీఎల్ సమరానికి సర్వం సిద్ధంచేశారు. లీగ్‌ దశలో 70 మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఉంటాయి.

తుది షెడ్యూల్‌ ప్రకటించ కపో యినా... మే 26న ఫైనల్‌ జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన 16 సీజన్లలో చెన్నై, ముంబై ఐదేసిసార్లు విజేత గా నిలవగా కోల్‌కతా 2 సార్లు టైటిల్‌ సాధించింది

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:25

Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్

ఢిల్లీ: ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు..

అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)కు తరలించనున్నారు.

స్పెషల్ సీబీఐ కోర్టు (CBI Court) జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు.

10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

కేంద్ర పారామిలటరీ బలగాలను ఢిల్లీ పోలీసు (Delhi Police) యంత్రాంగం రంగంలోకి దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నేడు ధర్నాలు నిర్వహించే అవకాశం అవకాశం ఉంది.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:23

నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణ

డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.

తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత ( Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు..

జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.

రాజకీయ ప్రోద్బలంతోనే

రాజకీయ ప్రోద్బలంతోనే తనను ఈడీ అరెస్ట్ చేసిందని కవిత ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు తనను అరెస్ట్ చేయిస్తామని బహిరంగంగానే ప్రకటించిన విషయాన్ని తన పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఆధారాలు లేకపోయినా కుట్రలో భాగంగా తనను కేసులో ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని కవిత ఆరోపిస్తున్నారు. కొందరు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కేసులో తన పేరు చేర్చారని, చార్జ్‌షీట్‌లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదనే విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.

కవిత ఆరోపణలు

తన విషయంలో ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తనను ఢిల్లీకి తరలించారని, రిమాండ్‌ను రద్దు చేసి, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కవిత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరోవైపు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కవితను అరెస్ట్ చేశామని ఈడీ చెబుతోంది. మొత్తానికి సుప్రీంకోర్టు కవిత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందనేది వేచి చూడాలి.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:22

ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు విచారించిన ఈడీ ఆధికారులు

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఐదో రోజు ఈడీ ఆధికారులు విచారించారు. ఇవాళ సుప్రీంకోర్టులో బెంచ్ మీదకు కవిత రిట్ పిటిషన్ విచారణకు రానున్నది.

లిక్కర్ కేసులో కీలక విష యాలను రాబట్టడంలో భాగంగా ఆగస్ట్ 22న ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది.

నాలుగో రోజు కవిత పీఏలు రాజేష్, రోహిత్ లను విచా రించారు..

ఈడీ అధికారులు. కవిత అరెస్ట్ సమయంలో పీఏల ఫోన్లను సీజ్ చేయిం చిన అధికారులు.. ఫోన్లు అన్ లాక్ చేయించి అందులోని డేటా ఆధారంగా ప్రశ్నించింది.

మరో వైపు తన అరెస్టు అంశంలో ఈడీ అధికారులు నిబంధనలు ఉల్లంఘించా రంటూ కవిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయిం చారు.

ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండా ఈడీ అరెస్ట్ చేసిందని తన పిటిషన్ లో తెలిపారు.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:20

మహిళలను బస్సులో నుండి దించిన కండక్టర్

రాత్రి వేళ బస్సెక్కిన ఓ పది మంది మహిళలను ఆర్టీసీ కండక్టర్‌ ఓవర్‌ లోడ్‌ పేరిట నిర్ధాక్షిణ్యంగా దారి మధ్య లో వదిలి వెళ్లాడు. ఈ ఘటన గురువారం రాత్రి జగిత్యాలలో చోటుచేసు కున్నది.

జగిత్యాల నుంచి ధర్మారం వెళ్లే ఆర్టీసీ బస్సు రాత్రి 8 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ నుంచి బయలుదేరింది.

బస్సు ఓవర్‌ లోడ్‌ అయిందని, టికెట్లు ఇచ్చే మెషీన్‌లో చార్జింగ్‌ లేదని, మెషీన్‌ నుంచి టికెట్లు రావడం లేదన్న సాకుతూ రూరల్‌ మండలంలోని తిమ్మాపూర్‌ శివారులో గల నల్లగుట్ట వద్ద పదిమంది మహిళలను కండక్టర్‌ దింపేశాడు.

దీంతో మహిళా ప్రయాణి కులు ముందుకు, వెనక్కి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో తిమ్మాపూర్‌ క్రాస్‌ రోడ్డులోని గ్రామస్థులు ధర్మారం వైపు వెళ్తున్న చివరి బస్సును ఆపి వారిని ఎక్కించారు.

ఆ బస్సులోనూ ఓవర్‌లోడ్‌ ఉన్నదని కండకర్టర్‌ చెప్పగా, గ్రామస్థులు బతిమిలాడి బస్సు ఎక్కించి మహిళలను గమ్య స్థానాలకు దించాలని వేడుకున్నారు. ఈ విషయ మై డీఎం సునీతను సంప్ర దించగా స్పందించలేదని తెలిసింది...

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:19

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం

జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. జనగామ జిల్లా పెంబర్తి లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో చదువుతున్న ఐదుగురు విద్యార్థినిలకు అస్వస్థత నెలకొంది.

దీంతో హుటాహుటిన జన గామ మాత శిశు ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఐదుగురు విద్యార్థినిలకు ఫుడ్‌‌ పాయిజన్ అయినట్లు వెల్లడించారు వైద్యులు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్న వైద్యులు… వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

3 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు చెబు తున్నారు. కాగా…ఈ సంఘ టనపై కేసు నమోదు చేసు కున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 09:18

టెట్... టఫ్.. మాకొద్దు

రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌,కాకుండా, తమ కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని ఉపాధ్యా యులు కోరుతున్నారు.

దీని కోసం పలు ఉపాధ్యా య సంఘాల నేతలు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయను న్నట్టు ప్రభుత్వం నిర్ణయిం చిన విషయం తెలిసిందే.

ఈ డీఎస్సీ పరీక్షకు ముందే టెట్‌ నిర్వహించాలని నిర్ణ యించి, షెడ్యూల్‌ ప్రకటిం చింది. దాని ప్రకారం అభ్య ర్థులు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 10 వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు సమ ర్పించాలి. టెట్‌ను కంప్యూ టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సీబీటీ, పద్ధతిలో మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించ నున్నారు.

ఫలితాలను 20లోపు ప్రక టించనున్నారు. ఈ టెట్‌ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 20న జారీ చేయా ల్సి ఉంది. కానీ కొన్ని సాంకే తిక కారణాల వల్ల నిలిచిపో యింది. ఒకటి రెండు రోజు ల్లో విడుదల చేస్తామని అధి కారులు చెబుతున్నారు.

అయితే ఈ టెట్‌పై ఉపాధ్యా యులు కొంత అసంతృప్తితో ఉన్నారు. 2010 తర్వాత ఉపాధ్యాయులుగా ఎంపి కైన వారు కచ్చితంగా టెట్‌ పాసై ఉండాలనే నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. టెట్‌ సర్టిఫికెట్‌ ఉంటేనే వారికి పదోన్నతులు కల్పించనున్నారు.

రాష్ట్రం లో చాలామంది ఉపాధ్యా యులకు టెట్‌ సర్టిఫికెట్‌ లేదు. దాంతో వారికి పదోన్నతులు నిలిపి వేశారు. ఇలాంటి ఉపాధ్యా యులు ప్రస్తుతం ప్రకటించిన టెట్‌ రాసి, ఉత్తీర్ణులు కావా లని ప్రభుత్వం సూచిస్తోంది.

అయితే ఈ టెట్‌లో తాము ఉత్తీర్ణత సాధించలేమని, తమ కోసం ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

దీనికి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేన్‌,ఎన్‌సీటీఈ నిబంధనలు అంగీకరిం చవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తిగా మారింది...

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 07:40

తమిళనాడు ఎన్నికల బరిలో: మాజీ గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ గవర్నర్‌గా పని చేసి కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన తమిళసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నట్టు తెలిసింది..

భారతీయ జనతా పార్టీ బీజేపీ గురువారం విడుదల చేసిన మూడవ జాబితాలో తమిళనాడులోని 9 స్థానా లకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఫైర్‌బ్రాండ్ నేత తమిళనాడు బీజేపీ అధ్యక్షులు కే. అన్నామలై కోయంబత్తూరు నియోజ కవర్గం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగారు.

కేంద్ర మంత్రి డా. ఎల్. మురుగన్ నీలగిరీస్ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. మాజీ మంత్రి పొన్ రాధా కృష్ణన్ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తున్నారు.

వెల్లూరు నుంచి డా. ఏసీ షణ్ముగన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి సెల్వన్, కృష్ణగిరి నుంచి సి. నరసిం హన్, పెరంబలూరు నుంచి టీఆర్ పారివేంధర్, తిరునె ళ్వేలి నుంచి నైనార్ నాగేం ద్రన్ పేర్లను బీజేపీ అధిష్టా నం ప్రకటించింది.

తమిళనాడుతో ఎన్డీఏ మిత్రపక్షాలతో సీట్ల సర్దు బాటు అనంతరం బీజేపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపి కపై కొద్ది రోజుల క్రితం ఆ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశమైంది.

నిజంనిప్పులాంటిది

Mar 22 2024, 07:39

కాంగ్రెస్ మూడో జాబితా :ఐదుగురికి చోటు

ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కాంగ్రెస్‌ పార్టీ మూడో జాబితాను విడు దల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగు రికి చోటు దక్కింది.

పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజిగిరి – సునీతా మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్‌ – దానం నాగేందర్‌, చేవెళ్ల- రంజిత్‌ రెడ్డి, నాగర్‌కర్నూల్‌ – మల్లు రవిని అభ్యర్థులుగా ఖరారు చేసింది.

అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజ రాత్‌, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్చేరిలోని కొన్ని స్థానా లకు అభ్యర్థులను ప్రకటిం చారు.

తెలంగాణకు సంబంధించి మొదటి జాబితాలో నాలు గు స్థానాలకు జహీరాబాద్‌ – సురేశ్‌ కుమార్‌ షెట్కర్‌, నల్గొండ – కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌- చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌ అభ్యర్థులను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

ఇంకా.. ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్‌, హైదరాబాద్‌, మెదక్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రకటించిన మూడు జాబితాల్లో కాంగ్రెస్‌ 139 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.